రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘాన్ని మొట్టమొదటగా స్థాపించిన పెద్దలను ఒక్కసారి స్మరించుకొంటూ సంఘం గురించి స్వామి వివేకానందుడు చెప్పిన అమూల్యమైన విషయాలను ఈ సంధర్భముగా మనమందరమూ ఒకసారి మననము చేసుకొనుట కనీసధర్మమనె భావనతో వాటిని మీకు అందిస్తున్నాము.
సంఘంలో ఉన్నవారు కలిసి పని చెయ్యడమంటే చెయ్యవలసిన పనులను పంచుకోవడమే. వారి వారి పనులను సక్రమంగా నెరవేర్చినప్పుడు, అది ఒక ఆదర్శవంతమైన సమన్వయాన్ని రూపొందిస్తుంది.
ఫలితాల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తామో అంతే శ్రద్ధను మనం పనిచేసే పద్ధతి మీద కూడా పెట్టాలి. ఇదే విజయ రహస్యం.
సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? వాళ్ళు ధనవంతులా, పేదవారా? ఇవేమీ ముఖ్యం కాదు. తమ ఆలోచలను, మాటలను, చేతలను ఒకటిగా చేసుకున్న నలుగురు కలిస్తే చాలు, ఈ ప్రపంచాన్నే తల్లక్రిందులు చేయవచ్చు. ఈ ధృఢ విశ్వాసాన్ని ఎల్లప్పుడు కలిగి ఉండండి.
మీకు సంఘంమీద అపారమైన అభిమానం ఉండాలి. అవిధేయతకు సంఘంలో స్థానమేలేదు. నిర్దాక్షిణ్యంగా దాన్ని అణచివేయండి. మాటవినని, భాధ్యతగా పని చేయని సభ్యులకు సంఘంలో ఎటువంటి స్థానం ఇవ్వకండి. అలాంటివారెవరైన సంఘంలో ఉంటే వారిని బహిష్కరించివేయాల్సిందే. సంఘంలో సభ్యులందరూ గాలిలాగ స్వేచ్ఛగానూ, ఒక చిన్న మొక్కలాగ విధేయతతోనూ ఉండాలి.
"నాయకుడు" సమర్ధంగా పని చెయ్యాలంటే బహుముఖప్రజ్ఞగల బుద్ధిని కలిగి ఉండడం అత్యవసరం.
నాయకుడుగా వ్యవహరించడం చాలా కష్టమైన పని. అందుకోసం అతడు దాసులకు దాసుడై ఉండగలగాలి. వివిధరకాలైన మనస్తత్వాలను తన మనస్సులో చోటు చూపించగలిగే విశాల హృదయం కలిగిఉండాలి. అణువంతైనా స్వార్ధం, అసూయ ఉండకూడదు. అప్పుడే వారు గొప్ప నాయకుడు కాగలుగుతాడు.
నాయకుడు కాదలుచుకుంటే ముందు సేవకుడిగా ఉండడం నేర్చుకో, అదే అసలు రహస్యం. నీ మాటలు కరుకుగాఉన్నా నీ హృదయంలోని ప్రేమను ఇతరులు గుర్తించగలుగుతారు. మీ భాష ఎలా ఉన్నా ఆది ప్రేమతో నిండి ఉన్నప్పుడు ఇతరులు దాన్ని అప్రయత్నంగా అనుభూతి చెందగలుగుతారు.
నాయకుడు కాదలచుకున్న వ్యక్తి హద్దులెరుగని ప్రేమను కలిగి ఉండాలి. పని మధ్యలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని లెక్కకడుతూ ఆగిపోకూడదు. అవసరమైతే ఆ కార్యక్రమం సవ్యంగా కొనసాగుటకు ఏ పని చేయవలసి వచ్చిన తనే ముందుకు వచ్చి ఆ పనిని పూర్తి చేయాలి.
కార్యకర్తలు పదిమందైనా, ఇద్దరైన లెక్క చేయనక్కరలేదు. కానీ ఉన్న కొద్దిమంది సంపూర్ణమైన శీలాన్ని కలిగి ఉండాలి. ధనంవల్ల, పరువు-ప్రతిష్టతల వల్ల, విద్య వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మంచి శీలం మాత్రమే దుర్భేద్యమైన కష్టాల అడ్డుగోడల్ని పగులగొట్టుకుని ముందుకు చొచ్చుకు పోతుంది.
అత్యంత విశ్వాసపాత్రులైన కార్యకర్తలున్నవారితో పునాది వేసిన తర్వాత ఎవ్వరువచ్చి ఎటువంటి కలకలం రేపిన భయపడవలసిన పనిలేదు. ఏ మంచి పనైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాధించడం కుదరదు. అయితే చిట్టచివరిదాకా పట్టుదలతో శ్రమించేవారే విజయాన్ని సాధిస్తారు.
ఎప్పటికీ మీ మనస్సులలో అహంకారానికి చోటివ్వకండి. ఎప్పటికీ మీ హృదయాలలో మంచి ప్రేమను తొలగిపోనివ్వకండి.
బ్రహ్మశ్రీ అములోజు శివప్రసాద్
ప్రధాన కార్యదర్శి
బ్రహ్మశ్రీ గోర్సవెంకటరమణ,
కోశాధికారి
బ్రహ్మశ్రీ లక్కోజు వీరభద్రరావు (లక్కోజీ)అధ్యక్షులు
All Rights Reserved. Vishwa Brahmana Sangam, Rajahmundry
Designed By BSquare